ఉప్పల్ స్టేడియం వద్ద సందడి.. భారీగా తరలివచ్చిన క్రికెట్ అభిమానులు
ఐపీఎల్ 2025లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్, ఢిల్లీ జట్లు సోమవారం తలపడుతున్నాయి.
ఉప్పల్ స్టేడియంలో జరిగే మ్యాచ్లను చూడటానికి అభిమానులు భారీ సంఖ్యలో వచ్చారు , దీంతో స్టేడియం చుట్టూ సందడి నెలకొంది.
అభిమానులు కేరింతలు కొడుతూ హైదరాబాద్ జట్టుకు మద్దతు తెలిపారు.
ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ప్లే ఆఫ్స్ ఫైట్లో ముందుకు వెళ్లగలుగుతుంది. కాబట్టి ఈ మ్యాచ్ ఢిల్లీకి అత్యంత కీలకమైన మ్యాచ్ అని చెప్పాల్సిందే.
ఈ రోజు మ్యాచ్లో గెలిస్తే హైదరాబాద్ టీమ్ సాంకేతికంగా ప్లే ఆఫ్స్ రేసులో ఉంటుంది.
ఈ రోజు మ్యాచ్ లో మాత్రం హైదరాబాద్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఢిల్లీ మెయిన్ బట్టెర్స్ ని పెవీలియన్ కి పంపారు