భారత్‌ వరుసగా రెండోసారి  అండర్ 19 టీ20 వరల్డ్‌ కప్‌ విజేతగా నిలిచింది 

ఫైనల్లో దక్షిణాఫ్రికా నిర్దేశించిన 83 పరుగుల టార్గెట్‌ను ఛేదించిన భారత్

తెలుగు బిడ్డ గొంగడి త్రిష బ్యాటింగ్‌లో 44 పరుగులు చేసింది

త్రిష బౌలింగ్‌లోను రాణించి 15 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టింది

దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 82 పరుగులకే ఆలౌట్ అయింది

ఆ జట్టులో వాన్‌ వూరస్ట్ (23) టాప్‌ స్కోరర్ గా నిలిచింది 

భారత బౌలర్లలో త్రిష 3,వైష్టవి 2, ఆయుషి 2, పరుణిక 2, షబ్నమ్ ఒక వికెట్ తీశారు 

తర్వాత బ్యాటింగ్ చేసిన భారత్ దక్షిణాఫ్రికా నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించింది

9 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికా పై భారత్ గెలిచింది