హార్దిక్‌ ప్లేస్‌లో ముంబై ఇండియన్స్‌కు  కొత్త కెప్టెన్..

ముంబై ఇండియన్స్ జట్టు తమ నూతన సారథిని ప్రకటించింది.

 తొలి మ్యాచ్‌లో అతడే తమ జట్టును నడిపిస్తాడని వెల్లడించింది.

మాజీ సారథి రోహిత్ శర్మను కాదని అతడికి కెప్టెన్సీ చార్జ్ ఇచ్చింది.

 ఈ విషయంపై ఎంఐ ఫ్రాంచైజీ అధికారిక ప్రకటన చేసింది.

ముంబై రెగ్యులర్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఐపీఎల్-2025 ఫస్ట్ మ్యాచ్‌లో ఆడటం లేదు.

గతేడాది ఐపీఎల్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా ఒక మ్యాచ్‌ సస్పెన్షన్‌కు గురయ్యాడు హార్దిక్.

 ఈ కారణంగానే మార్చి 23వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌లో అతడు ఆడటం లేదు

ఈ ఒక్క మ్యాచ్‌కే మిస్టర్ 360 సారథిగా వ్యవహరిస్తాడు. మిగతా మ్యాచుల్లో పాండ్యా కెప్టెన్‌గా కొనసాగుతాడు.