ఆర్సీబీకి తిరిగి రావొద్దనుకున్నా..  పాటిదార్ ఇలా అనేశాడేంటి..

  ఐపీఎల్-2022 మెగా ఆక్షన్‌లో తనను తీసుకోకపోవడంతో ఆర్సీబీపై కోపం వచ్చిందన్నాడు ఆ టీమ్ కెప్టెన్ రజత్ పాటిదార్.

  చివరికి సిసోడియా గాయపడటంతో తనను జట్టులోకి రీప్లేస్ చేశారని అతడు గుర్తుచేసుకున్నాడు.

  వేలంలో అట్టిపెట్టుకుంటానని చెప్పి.. ఎంపిక చేయకపోవడంతో ఆర్సీబీలోకి తిరిగి రావొద్దని అనుకున్నానని చెప్పుకొచ్చాడు.

  కెప్టెన్‌గా సెలెక్ట్ చేసినప్పుడు ఆందోళన చెందానని పాటిదార్ తెలిపాడు.

  విరాట్ కోహ్లీ అండగా నిలవడంతో కెప్టెన్సీ టెన్షన్ పోయిందన్నాడు.

  నువ్వు దీనికి అర్హుడివి అంటూ విరాట్ తనలో స్ఫూర్తిని రగిలించాడని పేర్కొన్నాడు పాటిదార్.

  ఈ ఐపీఎల్‌లో 11 మ్యాచుల్లో 239 పరుగులు చేశాడు రజత్.