పేస్ పిచ్చోడు వస్తున్నాడు..  ఆర్సీబీని ఇక ఆపలేం..

 ఐపీఎల్ రీస్టార్ట్‌కు ముందు బెంగళూరు జట్టుకు అదిరిపోయే గుడ్ న్యూస్.  

  ఐపీఎల్ వాయిదా పడగానే ఇంటికి వెళ్లిపోయిన స్పీడ్‌స్టర్ జోష్ హేజల్‌వుడ్ తిరిగి భారత ఫ్లైట్ ఎక్కనున్నాడని తెలుస్తోంది.

  కచ్చితంగా ఏ రోజు వస్తాడో తెలియకున్నా ప్లేఆఫ్స్ సమయానికి టీమ్‌తో జాయిన్ అవుతాడట హేజల్‌వుడ్.

  డబ్ల్యూటీసీ ఫైనల్ నేపథ్యంలో హేజల్‌వుడ్ భారత్‌కు వచ్చే చాన్సులు లేవని వినిపించింది.

  భుజం గాయంతో బాధపడుతుండటంతో అతడిపై ఆశలు వదిలేశారు అభిమానులు.

  కప్పు రేసులో ముందంజలో ఉన్న ఆర్సీబీ కోసం హేజల్‌వుడ్ రావాలని నిర్ణయించుకున్నాడని సమాచారం.

 హేజల్‌వుడ్ వస్తే ఆర్సీబీకి తిరుగుండదని.. కప్పు కల తీరడం ఖాయమని నెటిజన్స్ అంటున్నారు.