ఐపీఎల్‌లో డీజే-చీర్‌లీడర్స్ బంద్.. ఒప్పుకుంటారా..

ఇండో-పాక్ ఉద్రిక్తల్లో మన దేశానికి చెందిన కొంతమంది సైన్యం, పౌరులు ప్రాణాలు కోల్పోయారు.

మృతుల కుటుంబాలకు సంఘీభావంగా ఐపీఎల్‌లోని మిగిలిన మ్యాచుల్లో ఎంటర్‌టైన్‌మెంట్ ప్రోగ్రామ్స్ లేకుండా చూడాలని లెజెండ్ సునీల్ గవాస్కర్ కోరాడు.

డీజే పాటలు, చీర్‌లైడర్స్ సందడి లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశాడు. 

ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను గౌరవించడానికి ఇది సరైన మార్గం అని అన్నాడు.

గవాస్కర్ రిక్వెస్ట్‌ను బీసీసీఐ ఎంతవరకు పరిగణనలోకి తీసుకుంటుండో చూడాలి. 

ఐపీఎల్ 2025 మే 17న  రీస్టార్ట్ కానుంది.

జూన్ 3న నిర్వహించే ఫైనల్‌తో టోర్నమెంట్ ముగుస్తుంది.