మాల్యా గాలి తీసిన ఎస్‌బీఐ..  పరువు పోయిందిగా..!

ఆర్సీబీ తొలి ఐపీఎల్ ట్రోఫీని సొంతం చేసుకోవడంతో ఆ జట్టు మాజీ ఓనర్ విజయ్ మాల్యా హర్షం వ్యక్తం చేశారు. కల నెరవేరిందంటూ ఆనందంలో ఊగిపోయారు.

ఆటగాళ్లు, కోచింగ్ స్టాఫ్‌కు అభినందనలు తెలిపారు మాల్యా. అయితే ఆయన గాలి తీసేసింది ఎస్‌బీఐ.

సార్.. ఇండియాకు రండి. మనం కలసి సెలబ్రేట్ చేసుకుందామంటూ మాల్యా పోస్ట్‌కు ఎస్‌బీఐ పేరుతో ఉన్న ఒక ట్విట్టర్‌ అకౌంట్ నుంచి రిప్లయ్ వచ్చింది.

ఇది ఎస్‌బీఐ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ నుంచి వచ్చిన మెసేజా.. కాదా.. అనేది క్లారిటీ లేదు. అయితే మాల్యా పోస్ట్‌కు ఇచ్చిన కౌంటర్ మాత్రం వైరల్ అవుతోంది.

ఇది చూసిన నెటిజన్స్.. మాల్యా గాలి తీసేశారని అంటున్నారు.

మాల్యా.. ముందు భారత్‌కు వచ్చేయ్.. బ్యాంకుల నుంచి తీసుకున్న బాకీ చెల్లించు అంటూ సెటైర్స్ వేస్తున్నారు.

బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన మాల్యా.. ప్రస్తుతం విదేశాల్లో తలదాచుకుంటున్నాడు.