ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనల్ మెస్సీ మూడు రోజుల పాటు భారత దేశంలో పర్యటించనున్నారు.

కోల్‌కతా, హైదరాబాద్, ముంబై, ఢిల్లీ నగరాల్లో ఆయన పర్యటించనున్నారు. 

కోల్‌కతా పర్యటన సందర్భంగా మెస్సీ తన విగ్రహాన్నే తనే ఆవిష్కరించనున్నారు.

కోల్‌కతా లేక్ టౌన్‌లో 70 అడుగుల పొడవుతో ఈ విగ్రహ నిర్మాణం జరిగింది.

ఈ విగ్రహాన్ని శ్రీ  భూమీ స్పోర్టింగ్ క్లబ్ ఏర్పాటు చేసింది. 

ఓ పుట్‌బాల్ క్రీడాకారుడికి ఇంత ఎత్తులో విగ్రహం ఉండటం ఇదే మొదటిసారి. 

విగ్రహాన్ని టన్నుల కొద్దీ ఇనుముతో కట్టారు. ఇందుకోసం 40 రోజులు పట్టింది. 

ఫుట్‌బాల్ ఆటపై ఉన్న పిచ్చి ప్రేమతోటే  శ్రీ  భూమీ స్పోర్టింగ్ క్లబ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.