ఐసీసీ ర్యాంకుల్లో అదరగొట్టిన భారత ప్లేయర్లు.. 

 ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌ (IND vs ENG)లో భారత యువ బ్యాటర్ అభిషేక్ శర్మ అదరగొట్టాడు.

తాజాగా ప్రకటించిన ఐసీసీ ర్యాంకుల్లో దూసుకువచ్చాడు. ఏకంగా 38 స్థానాలు మెరుగుపర్చుకుని రెండో ర్యాంక్‌కి చేరుకున్నాడు.

 ఇంగ్లాండ్‌పై ఐదో టీ20లో సెంచరీ సాధించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం అభిషేక్  829 పాయింట్లతో ఉన్నాడు. 

 అగ్రస్థానంలో సన్‌రైజర్స్ జట్టుకు చెందిన అతని భాగస్వామి, ఆస్ట్రేలియా ఓపెనర్ ట్రావిస్ హెడ్ (855పాయింట్లు)కొనసాగుతున్నాడు.

వీరిద్దరి తర్వాత తిలక్ వర్మ (803), ఫిల్ సాల్ట్ (798), సూర్యకుమార్ యాదవ్ (738) ఉన్నారు.

ఇంగ్లాండ్‌పై ప్లేయర్ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచిన వరుణ్ చక్రవర్తి కి ఐసీసీ ర్యాంకుల్లోనూ మంచి గుర్తింపు లభించింది.

 బౌలింగ్ విభాగంలో జస్‌ప్రీత్ బుమ్రా (908) అగ్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు.

 టాప్‌-10లో బుమ్రాతో పాటు రవీంద్ర జడేజా కూడా ఉన్నాడు. జడేజా (745) తొమ్మిదో ర్యాంక్‌లో నిలిచాడు.