ఆర్మీకి స్టార్ క్రికెటర్స్ సెల్యూట్..  రియాక్షన్ అదిరిందంటూ..

 ఇండో-పాక్ వార్‌పై స్టార్ క్రికెటర్లు రియాక్ట్ అవుతున్నారు. మన ఆర్మీకి హ్యాట్సాఫ్ చెబుతున్నారు.

  యుద్ధం కోరుకున్న పాక్‌కు ఇండియా సరైన గుణపాఠం నేర్పుతుందని వీరేంద్ర సెహ్వాగ్ అన్నాడు.

  టెర్రరిస్టుల క్యాంపులను ధ్వంసం చేసినప్పుడు పాక్ సైలెంట్‌గా ఉండాల్సిందన్నాడు వీరూ.

  పాక్ ఎప్పటికీ మర్చిపోలేని రీతిలో మన భద్రతా బలగాలు సమాధానం ఇస్తాయన్నాడు.

  దేశ రక్షణలో భాగంగా ఆర్మీ తీసుకునే ప్రతి నిర్ణయాన్ని గౌరవిస్తానన్నాడు టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.

  భారత ఆర్మీపై గర్వపడుతున్నానని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటానికి ప్రజల మద్దతు ఉంటుందని జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా అన్నాడు.

 టెర్రరిజానికి వ్యతిరేకంగా భారత్ బలంగా నిలబడుతుందన్నాడు మాజీ క్రికెటర్ శిఖర్ ధవన్.