ఒలింపిక్స్‌లో క్రికెట్.. 6 జట్లతో ఈవెంట్.. పాక్‌కు నో చాన్స్

  లాస్ ఏంజిల్స్ ఒలింపిక్స్-2028లో క్రికెట్‌ను ప్రవేశపెడుతున్నారు.

  ఈ విశ్వక్రీడల్లో క్రికెట్‌లో ఎన్ని టీమ్స్ పాల్గొంటాయనే దానిపై తాజాగా ఐవోసీ క్లారిటీ ఇచ్చింది.

  మెన్స్, విమెన్స్ కేటగిరీల్లో ఆరేసి జట్లు, 90 మంది చొప్పున ప్లేయర్లు పార్టిసిపేట్ చేస్తారని స్పష్టం చేసింది.

  ఒలింపిక్స్‌కు హోస్ట్‌గా ఉన్న యూఎస్‌ఏ నేరుగా క్వాలిఫై అవుతుంది. ఇది పోనూ.. మరో 5 జట్లు టోర్నీలో పాల్గొంటాయి.

  టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం చూసుకుంటే 7వ స్థానంలో ఉన్న పాకిస్థాన్ ఒలింపిక్స్‌కు క్వాలిఫై అవ్వదు.

  క్వాలిఫికేషన్ గురించి అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు.

   వచ్చే విశ్వక్రీడల్లో క్రికెట్‌తో పాటు బేస్‌బాల్, ఫ్లాగ్ ఫుట్‌బాల్, లాక్రోస్, స్క్వాష్‌ను కొత్తగా చేర్చారు.