23 ఏళ్ల కుర్రాడి సంచలన రికార్డు..  తొలి భారత బ్యాటర్‌గా.. 

గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ సాయి సుదర్శన్ సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేశాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో 82 పరుగుల స్టన్నింగ్ నాక్‌తో సాయి చెలరేగాడు. 

ఐపీఎల్‌లో ఒకే వెన్యూలో వరుసగా 5 సార్లు 50 ప్లస్ స్కోర్లు చేసిన తొలి భారత బ్యాటర్‌గా చరిత్ర సృష్టించాడు.

సాయి సుదర్శన్ కంటే ముందు డివిలియర్స్ ఈ ఫీట్ నమోదు చేశాడు. 

2019లో ఆర్సీబీ తరఫున ఆడుతూ చిన్నస్వామి స్టేడియంలో వరుసగా 5 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు బాదాడు ఏబీడీ.

ఐపీఎల్ తాజా ఎడిషన్‌లో 5 మ్యాచుల్లో 273 పరుగులతో ఆరెంజ్ క్యాప్ లిస్ట్‌లో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు సాయి సుదర్శన్.