టీమిండియా స్టార్లపై కనకవర్షం..  ఒక్కొక్కరికి ఎంతంటే..

ఐపీఎల్-2025 ఆరంభానికి ముందు భారత జట్టు ఆటగాళ్లకు అదిరిపోయే న్యూస్.

చాంపియన్స్ ట్రోఫీ-2025ను టీమిండియా గెలుచుకున్న నేపథ్యంలో భారీ నజరానా ప్రకటించింది బోర్డు

రూ.58 కోట్లను క్యాష్ ప్రైజ్‌గా అనౌన్స్ చేసింది బీసీసీఐ

విన్నింగ్ టీమ్‌లోని ప్రతి ప్లేయర్‌కు రూ.3 కోట్లు అందనున్నాయి

హెడ్ కోచ్ గౌతం గంభీర్‌కు కూడా రూ.3 కోట్లు ఇవ్వనుంది బోర్డు

మిగిలిన కోచింగ్ స్టాఫ్, సపోర్ట్ స్టాఫ్‌కు రూ.50 లక్షలు చొప్పున అందజేయనున్నారు.

మెగా టోర్నీలో ప్లేయర్ల పెర్ఫార్మెన్స్‌కు ప్రోత్సాహకంగా క్యాష్ రివార్డు ఇస్తున్నట్లు బోర్డు వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తెలిపారు