హైదరాబాద్ ట్యాంక్ బండ్ లో  గణనాథుల నిమజ్జనం..

హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌‌‌‌లో వినాయక విగ్రహాల నిమజ్జనాలు కొనసాగుతున్నాయి.

11రోజులపాటు జరిగిన వినాయక పూజల అనంతరం విగ్రహాల నిమజ్జనం కోలాహలంగా సాగింది.

గణేశ్ విగ్రహాల నిమజ్జనం కోసం భారీ లారీలు, ట్రాక్టర్లు, ఆటోల ద్వారా భాగ్యనగరంలోని హుస్సేన్ సాగర్‌కు తరలించారు.

నిమజ్జనం కోసం బారులు తీరిన గణనాథులు

హుస్సేన్ సాగర్‌‌లో నిమజ్జనమైన గణనాథులు

గణేశ్ నిమజ్జనానికి ఆలస్యం అవుతుండటంతో లారీపై నిద్రపోతున్న యువకులు

గణనాథుల నిమజ్జనం చూడటానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. భక్తులతో ట్యాంక్‌బండ్‌ పరిసరాలు కిటకిటలాడుతున్నాయి.

డీజేలతో యువకులు కేరింతలు, డ్యాన్సులు చేస్తూ ఉత్సాహంగా గడిపారు