గణేశ నిమజ్జనం వేళ భక్తుల రాస్తారోకో..

యాదాద్రి భువనగిరి జిల్లాలో లంబోదరుని నిమజ్జన మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి.

శనివారం తెల్లవారుజామున నుంచే గణనాథుని శోభాయాత్ర మొదలైంది. నగరంలోని వీధులు జనాలతో కిక్కిరిసిపోయాయి.

పరమేశ్వర పుత్రుడుని చివరిరోజున దర్శించుకునేందుకు నగరవ్యాప్తంగా ఉన్న భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.

అయితే, భువనగిరిలో పలుచోట్ల భక్తులు శోభాయాత్రలో పోలీసుల తీరుపై ఆందోళన వ్యక్తం చేశారు. 

వందలమంది జనాలు రోడ్లపైకి వచ్చి రాస్తారోకో చేశారు. అయితే, పోలీసులు కాసేపట్లోనే భక్తులను శాంతపరచడంతో వివాదం సద్దుమణిగింది.