విష్ణువుకు ప్రీతికరమైన రోజు ఉపవాసాల వ్రతాలు ప్రారంభమయ్యే శుభదినం పండుగలకు స్వాగతం పలికే రోజు ‘తొలి ఏకాదశి
ఆషాడ మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని ‘తొలి ఏకాదశి’ అంటారు. దీనినే ‘శయన ఏకాదశి’ అని కూడా పిలుస్తారు.
తొలి ఏకాదశి సందర్బంగా వరంగల్ కరీమాబాద్ లో కురుమ కులస్తులు బీరప్ప కామరతి, అక్క మహంకాళి దేవతమూర్తులకు బోనాలు సమర్పించారు.
వరంగల్ కరీమాబాద్లో బీరన్న బోనాలకు హాజరైన మంత్రి సురేఖ
రామస్వామి గుడి నుంచి బురుజు సెంటర్ మీదుగా ఒగ్గుడోలు కళాకారుల వాయిద్యాలు..శివాసత్తుల నృత్యాలు..బీరన్నల విన్యాసాలు మధ్య వందలాది మంది మహిళలు బోనలతో పాటు పట్టువస్త్రాలతో బీరప్ప ఆలయానికి చేరుకున్నారు.
ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి బోనం నైవేద్యం సమర్పించిన అనంతరం పట్టు వస్త్రాలు కానుకగా ఇచ్చి ఒడిబియ్యం పోశారు.
శతాబ్ద క్రితం ప్లేగు వ్యాధి పుట్టి ప్రజలు చనిపోతుండగా వారు బీరన్న స్వామిని ప్రార్థించి, ఈ వ్యాధిని నివారిస్తే నీకు బోనం సమర్పిస్తాము అన్నారు.
ఆ తర్వాత ప్లేగ్ వ్యాధి తగ్గిపోయిందన్న విశ్వాసంతో బోనాలు సమర్పించడం ప్రారంభించారు. అప్పటినుండి ఏటేటా వైభవంగా ఈ బోనాల ఆచారం కొనసాగుతోంది.