పంతగుల పండగ సమయంలో నిషేధిత  చైనా మాంజా వినియోగించడం నేరం 

వాటి వల్ల మనుషులు, పక్షుల ప్రాణాలకు ముప్పు కలుగుతోందని అడిషనల్‌ డీసీపీ అందె శ్రీనివాసరావు తెలిపారు

పురానీహవేలిలో విలేకరులతో ఆయన మాట్లాడారు

నగర సీపీ సీవీ ఆనంద్‌ ఆదేశాల మేరకు నిషేధిత చైనా మాంజా విక్రయాలపై నిఘా పెట్టామని

మూడు రోజులుగా నిర్వహించిన స్పెషల్‌ డ్రైవ్‌లో ఏడు టాస్క్‌ఫోర్స్‌ బృందాలు పనిచేశాయని తెలిపారు

చైనా మాంజా విక్రయిస్తున్న 148 మందిపై 107 కేసులు నమోదు చేసారు 

రూ.88 లక్షల విలువైన 7,334 కిలోల నిషేధిత చైనా మాంజాను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు

ఎవరైనా చైనా మాంజా విక్రయించినా,

వినియోగించినా 100కు ఫోన్‌ చేయాలని రాచకొండ సీపీ సుధీర్‌బాబు కోరారు