వడ్డె ఓబన్న జయంతి వేడుకలను  ఏపీ ప్రభుత్వం జరుపుతోంది

తెలుగువారి ఆత్మగౌరవం కోసం వడ్డె ఓబన్న పోరాడారని ముఖ్యమంత్రి చంద్రబాబు గుర్తుచేసుకున్నారు

ఉయ్యాలవాడ నరసింహారెడ్డికి వడ్డె ఓబన్న సన్నిహితుడుగా ఉన్నారు

నల్లమల కేంద్రంగా గెరిల్లా పద్ధతుల్లో బ్రిటీష్ వారిపై ఆయన పోరాటం చేశారు

కర్నూలు శివారులోని జగన్నాథ కొండపై పట్టుబడి 39 ఏళ్లకే వడ్డె ఓబన్న అమరత్వం పొందారు

రేనాటి వీరుడు ఓబన్న చరిత్ర నేటి తరాలకు తెలపాలని చంద్రబాబు అన్నారు

ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్‌లో ఓ పోస్టు చేశారు

వడ్డే ఓబన్న జయంతిని అధికారికంగా నిర్వహిస్తున్నామని చంద్రబాబు తెలిపారు

బ్రిటిష్‌ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మగౌరవం నిలిపారు 

వడ్డే ఓబన్న వీరోచితంగా పోరాడారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు