రూ.2 లక్షల కోట్లకుపైగా ప్రాజెక్టులకు  ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపనలు  చేశారు

విశాఖకు కేంద్రం నిధులు మంజూరుచేయడంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి

సభా వేదికపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు విశాఖ ప్రాధాన్యాన్ని గుర్తుచేశారు

ప్రధాని నరేంద్రమోదీ విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌కు శంకుస్థాపన చేసారు

విద్యుత్‌ రంగంలో నూతన విప్లవానికి నాంది పలికిన హైడ్రోజన్‌ పవర్‌లో

విశాఖపట్నం అత్యంత కీలకంగా మారబోతోందని ప్రధానమంత్రి ప్రకటించారు

భవిష్యత్తులో హైడ్రోజన్‌ గ్రీన్‌ ఎనర్జీ ద్వారా ఏపీలో ఉపాధి అవకాశాలు లభిస్తాయని ప్రధాని వివరించారు

విశాఖను ఆర్థిక రాజధానిగా మరింత బలోపేతం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు

ప్రపంచానికి అరకు కాఫీని పరిచయం చేసిన ఘనత ప్రధాని మోదీకి దక్కుతుందన్నారు