తిరుపతి ఘటనపై ముఖ్యమంత్రి  చంద్రబాబు ఉన్నతస్థాయి సమావేశం  నిర్వహించారు

ఈ ఘటనకు కారణమైన వారిపై వెంటనే కేసులు నమోదు చేయాలని ఆదేశించారు

బైరాగిపట్టెడ వద్ద లోపల ఉన్న ఒక మహిళకు గాలి ఆడక స్పృహ తప్పి పడిపోయిందని,

ఆమెను కాపాడేందుకు అక్కడి డీఎస్పీ గేటు తీశారని పోలీసులు నివేదికలో తెలిపారు

దర్శనం టిక్కెట్లు కోసం గేటు తీశారని భావించి ఒక్కసారిగా భక్తులు బయటకు వచ్చారని చెప్పారు

గేటు తీయడంతోనే తొక్కిసలాట ప్రారంభమైందని సీఎం చంద్రబాబు తెలిపారు

అసలు టీటీడీ ఈఓకు సమాచారం ఎప్పుడు వచ్చిందని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు

భక్తులు వస్తారని తెలిసి ప్లానింగ్ ఎందుకు చేయలేకపోయారని చంద్రబాబు నిలదీశారు

బాధ్యులైన అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు