ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు

బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు

ఈ ఘటనలో 9 మంది మరణించారు

8 మంది జవాన్లు కాగా.. ఒకరు వ్యాన్ డైవర్‌ అని భద్రతా దళాలు తెలిపాయి

ఈ ఘటనలో మరో 8 మంది జవాన్లు గాయపడ్డారు

ఈ సంఘటన బెద్రే - కుత్రు రహదారిపై చోటు చేసుకుంది

భద్రతా బలగాల వాహనం కుత్రు అటవీప్రాంతం వద్దకు రాగానే..

మావోయిస్టులు మందుపాతరను పేల్చారు

ఈ క్రమంలో పోలీసు వాహనం తుక్కుతుక్కైంది