ద్రవిడ యూనివర్సిటీలో ‘స్వర్ణ కుప్పం  విజన్ 2029’ డాక్యుమెంట్‌ ఆవిష్కరణ  జరిగింది

ఈ సందర్భంగా నిర్వహించిన సభలో సీఎం మాట్లాడారు

వైకాపా హయాంలో రాష్ట్రం వెనుకబడిందని..

అప్పుల కుప్పగా మారిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు

రాబోయే రోజుల్లో కుప్పంను ఎలా అభివృద్ధి చేస్తామో ప్రణాళికలు రచించాం

కుప్పానికి పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తాం

జీవితం ఎవరికీ జాక్‌పాట్‌ కాదు.. ఒకసారి అవకాశం వస్తుంది

దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వైకుంఠపాళి తరహా పరిస్థితే ఎదురవుతుంది

రాజకీయం, వ్యాపారం సహా అన్ని రంగాలకూ ఇది వర్తిస్తుంది అని చంద్రబాబు అన్నారు