పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. విశేషాలు
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు బుధవారం (28-01-26) ప్రారంభమయ్యాయి.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.
రెండో రోజు (గురువారం).. ఈ సమావేశాల్లో ఆర్థిక సర్వేని మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు.
కేంద్ర ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్ తొమ్మిదో సారి.. బడ్జెట్ను సభలో ప్రవేశ పెట్టనున్నారు.
ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీ ఆదివారం వచ్చింది. ఆదివారం బడ్జెట్ ప్రవేశపెట్టడం పార్లమెంట్ చరిత్రలోనే తొలిసారి.
ఈ ఏడాది పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు.. రెండు విడతల్లో జరగనున్నాయి.
జనవరి 28 నుంచి ఫిబ్రవరి 13వ తేదీ వరకు మొదటి దశలో జరుగుతాయి.
మార్చి 9 నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు రెండో దశ సమావేశాలు జరుగుతాయి.
ఈ సమావేశాల్లో బడ్జెట్పై సుదీర్ఘ చర్చ, ఇతర బిల్లులు ఆమోదంతోపాటు వివిధ అంశాలపై సభ్యులు చర్చించనున్నారు.
Related Web Stories
సంక్రాంతి పండగ వేళ ప్రభుత్వం గుడ్ న్యూస్
తిరుమల శ్రీవారి ఆలయంపై వైసీపీ కుట్రలు
కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం... ప్రత్యేక పూజలు
కేసీఆర్, హరీష్ రావులపై కవిత షాకింగ్ కామెంట్స్