సీఎం చంద్రబాబు దుబాయ్ పర్యటన..

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు దుబాయ్‌తో మూడు దశాబ్ధాల అనుబంధం ఉంది. తన సుదీర్ఘ ప్రజాజీవితంలో ఆయన అనేక సార్లు దుబాయిని సందర్శించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుబాయ్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. శుక్రవారం తెలుగు ప్రవాసీయులను ఆయన కలిశారు. ఆంధ్రప్రదేశ్ వార్మ్‌లీ వెల్కమ్స్ ది గల్ఫ్ తెలుగు డయాస్పోరా కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇతర గల్ఫ్ దేశాలలో ఈ రకమైన సామూహిక సమావేశాలు జరగడం అత్యంత అరుదు. 1990లలో పాకిస్థాన్ ప్రధాని నవాజ్ షరీఫ్, 2010లలో తెలంగాణ ధూంధాం, 2015లో ప్రధాని నరేంద్ర మోదీల సభలు ఈ అత్యంత అరుదైన సభల జాబితాలోకి వస్తాయి.

దుబాయిలో జన్మించిన 9 ఏళ్ల వేమూరి హంశ్ నుంచి మొదలుకుని కాకినాడలో పుట్టి పెరిగి దుబాయిలో స్ధిరపడ్డిన 92 ఏళ్ల ఫాతిమా వరకు సీఎం చంద్రబాబు నాయుడును కలిశారు.

1965 భారత-పాకిస్తాన్ యుద్ధంలో జాతికి తన బంగారాన్ని విరాళమిచ్చిన అలనాటి కాకినాడ లేడీస్ క్లబ్ ప్రధాన కార్యదర్శి ఫాతిమా ఆంధ్రప్రదేశ్‌ను దుబాయి తరహాలో తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు.

సౌదీ అరేబియా నుంచి భారీ సంఖ్యలో 25 మంది వచ్చారు. అలాగే కువైట్, బహ్రెయిన్, ఖతార్, ఒమాన్ దేశాల నుండి సైతం ప్రవాసీయులు ఈ సమావేశానికి తరలి వచ్చారు.

సీఎం చంద్రబాబు నాయుడు ఓ సాధారణ వ్యక్తిలా సాదాసీదాగా అందరితోనూ కలిసిపోయారు. ఎంతో ఆప్యాయంగా పలకరించి, అడిగిన వారితో ఫొటోలు సైతం దిగారు.