విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్‌‌పై సీఎం చంద్రబాబు  ఆసక్తికర వ్యాఖ్యలు

ప్రధాని మోదీ సహకారంతో గూగుల్‌తో ఒప్పందం సాధ్యమైందని ఉద్ఘాటించారు.

నేను చూసిన ప్రధానుల్లో మోదీ చాలా ప్రత్యేకమని ప్రశంసించారు.

ముందుచూపుతో నిర్ణయాలు తీసుకోవడంలో ప్రధాని మోదీని ఎవరూ అందుకోలేరని చెప్పుకొచ్చారు.

మోదీ సారథ్యంలో 2047 కంటే ముందుగానే భారత్‌ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని నొక్కిచెప్పారు.

విశాఖకు గూగుల్‌ రావడంతో విప్లవాత్మక మార్పులు వస్తాయని పేర్కొన్నారు.

గూగుల్ డేటా సెంటర్‌కు అన్నివిధాలా ఏపీ ప్రభుత్వం సహకరిస్తుందని తెలిపారు.

ఏపీ ఐటీ రంగంలో అనేక మార్పులు వస్తాయని సీఎం చంద్రబాబు వెల్లడించారు.

పలు కంపెనీలు గూగుల్ బాటలో పయనించే అవకాశం ఉందని వివరించారు.

నైతిక విలువలతో కూడిన ఏఐ టెక్నాలజీ అవసరమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.