నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీ హబ్‌గా విశాఖపట్నం ఎదుగుతోందని సీఎం నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు.

కాగ్నిజెంట్‌కు విశాఖపట్నం బిగ్గెస్ట్‌ సెంటర్‌ కావాలని ఆకాంక్షించారు.

నేను ఏది చేసినా మెగా స్కేల్‌లో ఉంటుందని వివరించారు.

ఈ ఏడాదిలోనే ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేస్తామని తెలిపారు.

అలాగే మెట్రో ప్రాజెక్టును త్వరగా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు.

ఈ ఏడాదిలోనే ఎయిర్‌పోర్ట్‌ పూర్తి చేస్తామని తెలిపారు.

విశాఖపట్నం వంటి సుందరమైన నగరం మరొకటి లేదని చెప్పుకొచ్చారు.

గతంలో మన దేశం అంటే చిన్నచూపు ఉండేదని తెలిపారు.

విశాఖలో సీఎం చంద్రబాబు శుక్రవారం పర్యటించారు.

కాగ్నిజెంట్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు సీఎం చంద్రబాబు.

రూ.1,583 కోట్లతో 3 దశల్లో క్యాంపస్‌ నిర్మాణం పూర్తికి ప్రణాళికలు రచించారు.