పార్లమెంటు శీతాకాల సమావేశాలు డిసెంబర్ 1వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి.
డిసెంబర్ 19వ తేదీ వరకూ ఈ సమావేశాలు జరుగుతాయి.
ఈ సమావేశాలకు ముందు సంప్రదాయంగా నిర్వహించే అఖిలపక్ష సమావేశాన్ని ఆదివారం ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ అఖిలపక్ష సమావేశం జరుగనుంది.
పార్లమెంటు సమావేశాలు సజావుగా జరిగేలా సహకరించాలని కేంద్రం కోరనుంది.
పార్లమెంట్ సమావేశాల్లో కీలకమైన పౌర అణు ఇంధన రంగంపై చర్చించనున్నారు.
ప్రైవేటు రంగానికి ఆహ్వానం పలికేందుకు ఉద్దేశించిన 'ది ఆటమిక్ ఎనర్జీ బిల్లు-2025'పై మాట్లాడనున్నారు.
పది కీలక బిల్లులు సభ ముందుకు రానున్నాయి.
పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో పది కీలక బిల్లులపై చర్చించి అమోదించే అవకాశాలు ఉన్నాయి.
Related Web Stories
ఏవియేషన్ రంగంపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
సత్యసాయి శతజయంతి వేడుకల్లో పాల్గొన్న ప్రముఖులు వీరే
వైభవంగా శ్రీసత్యసాయి బాబా శతాబ్ది ఉత్సవాలు
ఫలించిన సీఎం రేవంత్ రెడ్డి వ్యూహం..