హిందువులు పవిత్రంగా  భావించే చెట్లు ఇవే.. 

తులసి మొక్కను హిందువులు దేవతగా భావించి పూజలు చేస్తారు. 

రావి చెట్టును విష్ణువు ప్రతిరూపంగా భావిస్తారు. 

బిల్వ వృక్షం శివుడికి అత్యంత ప్రీతిపాత్రమైదని నమ్ముతారు.

అశోక వృక్షాన్ని సంతానోత్పత్తికి ప్రతీకగా భావిస్తారు. ఈ మొక్కలను దేవాలయాల దగ్గర నాటుతారు.

ఉసిరిని లక్ష్మీదేవికి ప్రతిరూపంగా భావిస్తారు. మతపరమైన అనేక వేడుకలలో ఉపయోగిస్తారు. 

తామర పువ్వును హిందువులు అత్యంత పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీ దేవి, విష్ణువుకు ఇష్టమైనదిగా భావిస్తారు. 

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మామిడి ఆకులను ఉపయోగిస్తారు. ప్రేమకు, శుభానికి సూచికగా భావిస్తారు.

వేపను దుర్గాదేవికి ఇష్టమైన మొక్కగా భావిస్తారు. గ్రామదేవతల పండగల్లో ఉపయోగిస్తారు.