ఒక గిన్నె తీసుకుని అందులో మైదా పిండి వేసుకోవాలి. ఇందులో కొద్దిగా పెరుగు, కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోవాలి. వీటిని కలిపాక ఉప్పు, కొద్దిగా నెయ్యి వేసి చేతికి అంటుకోకుండా ఉండేలా చపాతీ ముద్దలా మెత్తగా చేసుకోవాలి.
పిండి ఎంత మెత్తగా పిసికితే.. బాదుషాలు అంత సాఫ్ట్గా వస్తాయి. ఈ మిశ్రమాన్ని ఓ పావుగంట పక్కన పెట్టండి. ఆ తర్వాత ఉండలుగా చేసుకుని..
మధ్యలో ప్రెస్ చేసి.. హోల్ పెట్టండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ వేడి చేసుకోవాలి.
ఆయిల్ వేడెక్కగానే తయారు చేసి పెట్టుకున్న బాదుషాలను ఆయిల్లో వేసి ఎర్రగా వేయించుకోవాలి
స్టవ్ మీద ఓ గిన్నె పెట్టి నీళ్లు వేసి వేడి చేయాలి. నీళ్లు వేడెక్కగానే పంచదార వేసి కరిగించుకోవాలి. ఈ పంచదార మరుగుతుండగా కొద్దిగా నెయ్యి, యాలకుల పొడి వేసి కలపాలి.
పొయ్యి మీద ఉడుకుతున్నప్పుడే బాదుషాలను అందులో వేసి.. అన్నీ కాసేపు కలుపుతూ ఉండాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టాలి.
ఇప్పుడు బాదుషాలను తీసి పక్కన పెట్టి వాటిపై డ్రై ఫ్రూట్స్ తురుమును చల్లుకోవాలి. అంతే ఎంతో రుచిగా ఉండే బాదుషాలు సిద్ధం.