శంఖం పూలతో టీ.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

ఆయుర్వేదం ప్రకారం శంఖు పూలలో ఔషధ గుణాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవి ఎన్నో ఆరోగ్య సమస్యలకు చెక్ పెడతాయి. 

శంఖు పూలలో విటమిన్ ఎ, సి పుష్కలంగా ఉంటాయి. అంతేకాకుండా యాంటీఆక్సిడెంట్లు, యాంథోసైనిన్స్ ఉంటాయి. 

శంఖుపూలతో మరిగించిన నీటిని తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. 

శంఖు పూలలో శక్తివంతమైన యాంటీ-ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 

శంఖు పూల టీ మెటబాలిజమ్‌ను పెంచుతుంది. కేలరీలు బర్న్ చేయడంలో హెల్ప్ చేసి బరువును అదుపు చేస్తుంది. 

శంఖం పూల టీని రోజూ తాగడం వల్ల ముఖంపై ఉండే మొటిమలు తగ్గుతాయి. చర్మం కాంతివంతంగా మారుతుంది. 

శంఖు పూల టీ తాగిన పదిహేను నిమిషాలకే మన బ్రైయిన్​లో కార్టిసాల్ హార్మోన్​ విడుదలవుతుంది. ఒత్తిడిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. 

శంఖం పూల టీ రెగ్యులర్​గా తాగడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుంది. 

శంఖం పూలలోని యాంటీఆక్సిడెంట్లు, యాంథోసైనిన్స్  కళ్లకు మద్దతుగా నిలిచి కంటి చూపును మెరుగుపరుస్తాయి.