పాలను కచ్చితంగా  వేడి చేయాల్సిందేనా..

పాలను మరిగించి తాగడం అనే నియమాన్ని చాలా మంది కచ్చితంగా పాటిస్తారు. 

మనం ఉపయోగించే పాలను బట్టి మరిగించే విషయంలో జాగ్రత్తలు పాటించాలి. 

ప్యాకెట్ పాలు కాకుండా స్థానికంగా కొన్నప్పుడు కచ్చితంగా వేడి చేయాల్సిందే. 

స్థానికంగా కొన్న పాలలో బ్యాక్టీరియా ఉంటుంది. వేడి చేసినప్పుడు మాత్రమే అది నాశనం అవుతుంది. 

ప్యాకెట్ పాలను వేడి చేయాల్సిన అవసరం లేదు. 

ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ.

పాలను పాశ్చరైజేషన్ చేసిన తర్వాతే ప్యాకింగ్ చేస్తారు. అంటే పాలలోని ప్రమాదకర బ్యాక్టీరియాను నాశనం చేయడానికి ప్రత్యేక ఉష్ణోగ్రత వద్ద వేడి చేస్తారు. 

ప్యాకెట్ పాలను వేడి చేయడం వల్ల అందులోని విటమిన్ సి, విటమిన్ బి, ప్రోటీన్లు కూడా పోతాయి. 

ప్యాకెట్ పాలను పొంగే వరకు కాకుండా గోరు వెచ్చగా వేడి చేస్తే సరిపోతుంది.