చిన్న చేపలు ఇలా ఫ్రై చేస్తే  టేస్టు మామూలుగా ఉండదు..

ముందుగా చేపలను ఉప్పు  వేసి శుభ్రంగా కడగాలి.

తరువాత కారం, ధనియాల పొడి, జీలకర్రపొడి, పసుపు, అల్లంవెల్లుల్లి పేస్టు, నిమ్మరసం వేసి కలపాలి.

తరువాత మొక్కజొన్న పిండి, బియ్యప్పిండి వేసి, తగినంత ఉప్పు వేసి కలుపుకొని పదినిమిషాలు మారినేట్‌ చేసుకోవాలి.

స్టవ్‌పై పాన్‌ పెట్టి నూనె వేసి కాస్త వేడి అయ్యాక మారినేట్‌ చేసిన చేపలు వేసి వేగించుకుంటూ పక్కన పెట్టుకోవాలి.

మరొకపాన్‌లో కొద్దిగా నూనె వేసి కరివేపాకు, ఉల్లిపాయలు వేసి వేగించి తీసుకోవాలి. 

వీటితో గార్నిష్‌ చేసుకుని చేపల వేపుడును సర్వ్‌ చేసుకోవాలి.