కొన్ని ఆహార పదార్థాలను రెండో సారి వేడి చేయడం వల్ల విషపూరితమయ్యే ప్రమాదం ఉంటుంది. అవేంటో తెలుసుకుందాం. 

ఆహార పదార్థాలను పదే పదే వేడి చేసి తినడం వల్ల అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. 

బంగాళాదుంప కూరను పదే పదే వేడి చేయకూడదు. 

ఇలా చేస్తే అందులోని క్లోస్ట్రిడియం బోటులినమ్ అనే బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది.  

చికెన్‌ను వేడి చేయడం వల్ల అందులోని సాల్మొనెల్లా కారణంగా జీర్ణమవడం కష్టమవుతుంది. 

బచ్చలికూరను పదే పదే వేడి చేయడం వల్ల అందులోని నైట్రేట్లు హానికరంగా మారే ప్రమాదం ఉంది. 

గుడ్లను పదే పదే వేడి చేయడం వల్ల అందులోని ప్రొటీన్ క్షీణించి విష రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.