పెసరపప్పు ఇడ్లీ ఇలా చేస్తే  రుచితో పాటు ఆరోగ్యం..!

ముందుగా పెసరపప్పుని రెండు గంటల పాటు నానబెట్టాలి.

 ఆ తరవాత నీటిని వడగట్టి పెసరపప్పుని, మిక్సీలో పెరుగుతో పాటు రుబ్బాలి.

ఈ మిశ్రమాన్ని ఓ వెడల్పాటి గిన్నెలోకి వేసుకోవాలి. 

ఓ పాన్‌లో కాస్త నూనె వేసి ఆవాలు, మినప పప్పు, శనగ పప్పు, జీలకర్ర, కరివేపాకును చిటపటలాడించాలి.

 అల్లం, మిర్చి ముక్కలూ జతచేయాలి. క్యారెట్‌ తురుము, పసుపు కలపాలి. 

మంచి సువాసన వస్తుంటే రవ్వను వేసి వేయించి పక్కన పెట్టాలి. 

అంతా చల్లారాక ఈ మిశ్రమాన్ని పెసరపప్పు రుబ్బులో కలపాలి.

 కొత్తిమీర, ఉప్పు వేసి మూతపెట్టి ఇరవై నిమిషాలు తరవాత ఇడ్లీలు పెట్టుకుంటే సరి.