నోరూరించే  గోంగూర పచ్చడి  ఇలా చేసి పెడితే తిన్నవాళ్లందరూ  ఫిదా అవ్వాల్సిందే..!

కావాల్సిన పదార్థాలు మిరపకాయలు, గోంగూర ఆకులు, ​ మెంతులు, 1 టీ స్పూన్​ జీలకర్ర,  ఆయిల్,  చింతపండు, ఉప్పు, ​ పసుపు,వెల్లుల్లి రెబ్బలు

స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి మెంతులు జీలకర్ర వేసి దోరగా వేయించుకోవాలి. 

స్టవ్​ ఆన్​ చేసి పాన్​ పెట్టి నూనె పోసుకోవాలి. నూనె కాగిన తర్వాత చింతపండు, గోంగూర ఆకులు వేసి కలుపుతూ తేమ లేకుండా మగ్గించుకోవాలి. 

నూనెలో గోంగూర బాగా మగ్గిన తర్వాత స్టవ్​ ఆఫ్​ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలి.

మిక్సీజార్​లోకి కట్​ చేసిన పండుమిర్చి ముక్కలు, ఉప్పు, పసుపు, వెల్లుల్లి రెబ్బలు వేసి కచ్చాపచ్చాగా గ్రైండ్​ చేసుకోవాలి. 

ఆ తర్వాత వేయించిన మెంతులు జీలకర్ర పొడి, పూర్తిగా చల్లారిన గోంగూర వేసి మరోసారి గ్రైండ్​ చేసుకోవాలి. 

 గ్రైండ్​ చేసుకున్న గోంగూర పచ్చడిని గాజు జార్​లో పెట్టి ఫ్రిజ్​లో స్టోర్​ చేసుకుంటే సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది.

అద్భుతంగా ఉండే గోంగూర పండుమిర్చి పచ్చడి రెడీ

వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని తింటే అమృతమే. మీరూ ఓ సారి ట్రై చేయండి.