నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "చికెన్ దమ్ బిర్యానీ "సింపుల్‌గా ప్రిపేర్ చేసుకోండిలా!

చికెన్ దమ్ బిర్యానీ కి కావలసిన పదార్థాలు.. చికెన్ బాస్మతి బియ్యం, ఉల్లిపాయలు,తరిగిన టమోటాలు,ఏలకులు,ఎండిన ఎర్ర మిరపకాయలు, జీడిపప్పు

బాస్మతి బియ్యాన్ని కడిగి ఒక గంట పాటు నానబెట్టుకోవాలి.

చికెన్ తీసుకోని  అందులో  నిమ్మరసం, ఉప్పు, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కోట్ చేసి 30 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి.

తరిగిన ఉల్లిపాయలను వేసి బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.

మ్యారినేట్ చేసిన చికెన్ వేసి మీడియం మంట మీద 2-3 నిమిషాలు అప్పుడప్పుడు కలుపుతూ ఉడికించాలి.

బిర్యానీ మసాలా  నెయ్యి వేసి , సుగంధ ద్రవ్యాలు నూనె విడుదలయ్యే వరకు ఉడికించాలి .

నానబెట్టిన బాస్మతి బియ్యాన్ని పాత్రలో వేసి చికెన్‍తో మెత్తగా కలపాలి

సువాసన కోసం తరిగిన పుదీనా  కొత్తిమీర ఆకులు పైన చల్లుకోవలి

మూత మూసి, ప్రెజర్ కుక్కర్‌లో ఒకసారి విజిల్ వేయనివ్వండి

ఇక అంతే ..నోరూరించే రెస్టారెంట్ స్టైల్ "చికెన్ దమ్ బిర్యానీ రెడి