ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజూ కొన్ని ఆసనాలు వేయాలని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే..

అధోముఖాసనంతో శరీరం పూర్తిస్థాయిలో స్ట్రెచ్ అయ్యి రక్తప్రసరణ మెరుగవుతుంది. అలసట దూరమవుతుంది

భుజంగాసనంతో వెన్నెముక బలోపేతమై వెన్ను నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 

పశ్చిమోత్తనాసనంతో మెదడుకు సాంత్వన దక్కుతుంది. వెన్నెముక కూడా బలోపేతం అవుతుంది

సేతుబంధాసనంతో  ఛాతి, వెన్నెముక, వీపు కింద భాగంలో కండరాలు మరింతగా సాగి బలోపేతం అవుతాయి

శవాసనంతో మనసు పూర్తిస్థాయిలో రిలాక్స్ అయ్యి కొత్త శక్తిని సంతరించుకుంటుంది. ఒత్తిడి తగ్గుతుంది

సూర్య నమస్కారాలతో శరీరమంతా ఉత్తేజితం అవుతుంది. జీవక్రియలు మెరుగవుతాయి

తాడాసనంతో శరీరంలో సమతౌల్యం మెరుగవుతుంది. మొదట ఈ ఆసనం వేయాలని నిపుణులు చెబుతారు

వృక్షాసనంతో కాళ్లు బలోపేతం అవుతాయి. ఏకాగ్రత, బ్యాలెన్స్ మెరుగవుతాయి. మనసుకు స్థిరత్వం వస్తుంది