మైక్రోవేవ్ ఓవెన్లో
పెట్టకూడని ఆహార పదార్థాలు ఇవే..
చాలామంది తెలియక అన్ని ఆహారాలను మైక్రోవేవ్ ఓవెన్ లో పెట్టి వేడి చేస్తుంటారు. కానీ ఈ ఆహారాలు వేడి చేస్తే ప్రమాదం.
కారం మిరపకాయలు ఓవెన్ లో పెట్టినప్పుడు వాటిలో క్యాప్సైసిన్ గాలిలో విడుదల అవుతుంది. ఇది ఘాటైన వాసనతో ఓపెన్ ను పాడుచేస్తుంది.
గుడ్లను ఓవెన్లో పెడితే ఆవిరి ఏర్పడుతుంది. దీనివల్ల పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.
ప్రాసెస్ చేసిన మాంసం అధిక ఉష్ణోగ్రతకు గురైతే హానికరమైన రసాయనాలు విడుదల అవుతాయి. దీన్ని తింటే ప్రమాదం.
పాలకూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు ఓవెన్లో వేడి చేస్తే అవి చాలా మెత్తగా అయిపోతాయి. అసహ్యంగా అనిపిస్తాయి.
సాస్లు చిక్కగా ఉంటాయి. వీటిని ఓవెన్లో వేడిచేస్తే ఆవిరికి గురై పేలుడు సంభవించే ప్రమాదం ఉంటుంది.
బ్రోకలిని ఓవెన్లో వేడి చేస్తే వాటిలోని పోషక విలువలు తగ్గిపోతాయి.
Related Web Stories
కొబ్బరి నూనెతో ఈ వ్యాధి పరార్ ..
నిద్రలేచిన వెంటనే ఖాళీ కడుపుతో కాఫీ తాగుతున్నారా..
కల్తీ పాలను గుర్తించేందుకు సరికొత్త పద్ధతి.. ఇంట్లోనే ఈజీగా గుర్తించండిలా..!
ఈ తప్పులు మానెయ్యండి.. బరువు తగ్గించుకోండి!