ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరి చేతుల్లో స్మార్ట్ఫోన్ ఉంటుంది. స్మార్ట్ఫోన్ లేని వారిని చూడటం చాలా అరుదుగా మారింది.
బాత్రూంలో ఎక్కువ సమయం గడపడం ఎన్నో రకాల అనారోగ్యాలను తీసుకువస్తుందని వైద్యులు చెప్తున్నారు.
టాయిలెట్ సీట్పై చేతిలో మొబైల్ ఫోన్ని పెట్టుకుని కూర్చోవడం వలన ప్రాణాంతకమైన వ్యాధికారక క్రిములు దాడి చేసే అవకాశం ఉంది.
కురుపులు, సైనసిటిస్ వంటి శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, చర్మ వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది.
నివేదికల ప్రకారం, క్రిములు మొబైల్ ఫోన్ స్క్రీన్లపై 28 రోజుల వరకు జీవించగలవట..
హానికరమైన వ్యాధికారక క్రిముల ప్రమాదంతో, కడుపు నొప్పి, అతిసారం, ఇన్ఫెక్షన్, ఫుడ్ పాయిజనింగ్ మొదలుకొని అనేక సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంది
టాయిలెట్ సీట్లపై ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల పురీషనాళంపై ఎక్కువ ఒత్తిడి పడటంతో హేమోరాయిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది.
ఎక్కువసేపు టాయిలెట్ లో కూర్చోవడం వల్ల కటి నేల కండరాలు బలహీనపడతాయి. ఇది స్మూత్ గా ఉండాల్సిన పేగు కదలికలను ఎంతో అవసరం. పేగు జారిపోయే ప్రమాదం కూడా ఉంటుందని వైద్యులు చెప్తున్నారు.