బియ్యం నీటితో ముఖం కడుక్కోవడం వల్ల చర్మ సమస్యలు దూరమవుతాయి. ఇలా చేస్తే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల బియ్యాన్ని నానబెట్టాలి. 

బియ్యాన్ని వేరు చేసి, ఆ నీటిని బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి. 

పత్తి సాయంతో నీటిని ముఖంపై రాస్తూ, చేతులతో మసాజ్ చేయాలి. 

ఇలా చేస్తే చర్మానికి పోషణ అంది మెరుస్తూ ఉంటుంది. 

చర్మంపై మచ్చలు, పిగ్మెంటేషన్‌ను తగ్గిస్తుంది. 

చర్మాన్ని హైడ్రేటెడ్‌గా ఉంచడంలో బియ్యం నీరు సాయపడుతుంది.

చర్మాన్ని ఫ్రీరాడికల్స్ నుంచి రక్షించడంతో పాటూ ముడతలను నివారిస్తుంది. 

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.