రెడ్ రైస్‌లో ఫైబర్  ఎక్కువగా ఉంటుంది.

ప్రతీ వ్యక్తికీ రోజూ 8 గ్రాముల ఫైబర్ అవసరం కాబట్టి.. ఇది తింటే బెటర్.

రెడ్ రైస్‌లో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉంటాయి. అందుకే.. ఇది తినేవారికి మలబద్ధకం సమస్యే ఉండదు.

రెడ్ రైస్‌లో బ్లడ్ షుగర్‌ను తగ్గించే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. డయాబెటిస్ కంట్రోల్‌లో ఉండాలంటే ఎర్ర బియ్యం తినాల్సిందే.

బ్లడ్‌లో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ని తగ్గించే శక్తి  ఎర్ర బియ్యానికి ఉంది. ఇందులోని మెగ్నీషియం బీపీని క్రమబద్ధీకరిస్తుంది.

ఎర్రబియ్యంలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి.. శరీరం బరువు పెరగకుండా నియంత్రిస్తుంది.

రెడ్ రైస్‌లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో వ్యాధినిరోధక శక్తిని బలోపేతం చేయడంలో తోడ్పడుతుంది.

మన శరీరానికి అవసరమయ్యే బీ6 విటమిన్ గ్రూప్ ఎర్రబియ్యంలో ఉంటుంది. కాబట్టి ఇది తింటే ఉత్తమం.

రెడ్ రైస్‌లో ఆంథోసియానిన్, మాంగనీస్, జింక్ ఉంటాయి. ఇవన్నీ మన బాడీలో విషవ్యర్థాల్ని తరుముతాయి.