దగ్గు, జలుబు ఉన్నప్పుడు ఈ పండ్లు తింటే ఎంత వేగంగా కోలుకుంటారంటే..!

దగ్గు.జలుబు సమస్య వస్తే చాలారోజులు వేధిస్తాయి. వీటి నుంచి వేగంగా కోలుకోవాలంటే ఈ పండ్లు భలే సహాయపడుతాయి

ఆపిల్‌లో ఫైబర్, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గొంతు నొప్పిని తగ్గిస్తాయి

పైనాపిల్‌లో బ్రోమెలైన్ ఉంటుంది. ఇది దగ్గు, ముక్కు దిబ్బడను తగ్గిస్తుంది.

జామపండు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి యాంటీ మైక్రోబయల్ లక్షణాలను అందిస్తుంది.

దానిమ్మ పండ్లలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల రోగనిరోధక ఆరోగ్యానికి మద్దతు ఇస్తాయి. వాపును తగ్గిస్తాయి.

కివిలో విటమిన్ సి, ఇ , యాంటీఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. శరీరానికి ఇన్ఫెక్షన్లతో పోరాడే సామర్థ్యంలో సహాయపడతాయి.

 స్ట్రాబెర్రీలు ఇన్ఫెక్షన్ల నుంచి శరీర రక్షణను పెంచుతాయి.