సమతుల ఆహారం, నీరు రెండూ మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరం.

రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగితే అనారోగ్యాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.

ఇక సాధారణంగా జనాలు అన్నం తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే నీరు ఎక్కువగా తాగుతుంటారు.

అయితే, తిన్న వెంటనే నీరు తాగితే ఎసిడిటీ లేదా కడుపుబ్బరంగా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు

ఒక్కోసారి ఈ అలవాటు అనారోగ్యానికీ కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు

కాబట్టి అన్నం తిన్నాక ఎంతసేపటికి నీరు తాగాలో తెలిసుండాలి

సాధారణంగా కడుపులోని ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటలు పడుతుంది

ఈ మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగితే అవి జీర్ణక్రియకు అడ్డుపడతాయి

కాబట్టి ఆహారం తిన్నాక 45 నుంచి 60 నిమిషాల తరువాత నీరు తాగాలి

అంతేకాకుండా, తినడానికి అరగంట ముందు మాత్రమే నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు