సమతుల ఆహారం, నీరు రెండూ మంచి ఆరోగ్యానికి ఎంతో అవసరం.
రోజూ 3 నుంచి 4 లీటర్ల నీరు తాగితే అనారోగ్యాలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.
ఇక సాధారణంగా జనాలు అన్నం తింటున్నప్పుడు లేదా తిన్న వెంటనే నీరు ఎక్కువగా తాగుతుంటారు.
అయితే, తిన్న వెంటనే నీరు తాగితే ఎసిడిటీ లేదా కడుపుబ్బరంగా అనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు
ఒక్కోసారి ఈ అలవాటు అనారోగ్యానికీ కారణమవుతుందని హెచ్చరిస్తున్నారు
కాబట్టి అన్నం తిన్నాక ఎంతసేపటికి నీరు తాగాలో తెలిసుండాలి
సాధారణంగా కడుపులోని ఆహారం జీర్ణం కావడానికి రెండు గంటలు పడుతుంది
ఈ మధ్యలో నీళ్లు ఎక్కువగా తాగితే అవి జీర్ణక్రియకు అడ్డుపడతాయి
కాబట్టి ఆహారం తిన్నాక 45 నుంచి 60 నిమిషాల తరువాత నీరు తాగాలి
అంతేకాకుండా, తినడానికి అరగంట ముందు మాత్రమే నీరు తాగాలని వైద్యులు చెబుతున్నారు
Related Web Stories
కారులో వాటర్ బాటిల్ ఉంచుతున్నారా.. అవి తాగితే ఏమవుతుందో తెలిస్తే..
మామిడి పండును తింటున్నారా దాని ప్రయోజనాలు తెలిస్తే వదలరు
పసుపు పాలు లేదా పసుపు నీరు.. ఆరోగ్యానికి ఏది మంచిది..?
ఈ మార్పులు ఆర్థరైటిస్కు సంకేతాలు