రాత్రి పూట ఈ ఫుడ్స్ తినడం
చాలా డేంజర్..
ఆరోగ్యకరమైన జీవితానికి సరైన ఆహారం తీసుకోవడం చాలా ముఖ్యం. ముఖ్యంగా రాత్రిపూట మనం తీసుకునే ఆహారం మన ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.
రాత్రి 7 గంటల తర్వాత కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల జీర్ణ సమస్యలు, అధిక రక్తపోటు వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మటన్ బిర్యానీ సాయంత్రం 7 గంటల తర్వాత తినడం అంత మంచిది కాదు. ఇందులో కేలరీలు, కొవ్వు శాతం ఎక్కువగా ఉండటం వల్ల కాలేయ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది.
కేవలం ఒక చిన్న ప్లేట్ మటన్ బిర్యానీలో 500-700 కేలరీలు ఉంటాయి. ఇది బరువు పెరగడానికి దారితీస్తుంది.
మన దేశంలో చాలా మంది స్పైసీగా తింటారు. స్పైసీ ఫుడ్ రాత్రి వేళల్లో వీటిని తినడం వల్ల కడుపులో, గుండెలో మంట వస్తుంది.
రాత్రి 7 గంటల తర్వాత స్వీట్లు తినడం వల్ల నిద్రకు భంగం కలగడమే కాకుండా జీర్ణక్రియ కూడా కష్టమవుతుంది.
రాత్రిపూట బజ్జీ, పకోడీలు తినడం వల్ల కడుపులో అసౌకర్యం, గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు తలెత్తుతాయి.
Related Web Stories
పచ్చి కొబ్బరితో ఇన్ని అనారోగ్య సమస్యలకు చెక్..
ఉదయం నిద్ర లేవగానే పసుపు నీరు తాగితే ఏమవుతుందో తెలుసా..
ఈ ఫుడ్స్ తినండి.. గాయాలు ఇట్టే నయం అవుతాయ్
వెన్నునొప్పికి కారణాలు తెలుసా..?