బొప్పాయి పండులో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. అది ప్రొటీన్స్ను బ్రేక్ చేయటంలో ఉపయోగపడుతుంది. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
బొప్పాయి పండులోని హై ఫైబర్ మలబద్ధకం లాంటి సమస్యల్ని నివారిస్తుంది. రాత్రి వేళ ఆరోగ్యకరమైన బోవెల్ మూమెంట్స్ ఉండేలా చూస్తుంది.
ఇందులో విటమిన్ సీ, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి రోగ నిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
బొప్పాయిలోని తక్కువ కాలరీలు ఆకలిని తగ్గించి బరువు అదుపులో ఉంచడానికి సాయపడతాయి.
బొప్పాయిలో విటమిన్ సీ కూడా అధికంగా ఉంటుంది. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
కొంతమందిలో నిద్రపోయే ముందు బొప్పాయి తినటం వల్ల కడుపులో వికారం ఏర్పడే అవకాశం ఉంది
. కడుపు తిప్పటం లాంటివి కూడా జరగొచ్చు.
ఆయుర్వేదం ప్రకారం బొప్పాయి పండు శరీరాన్ని చల్ల బరుస్తుంది. సైనస్, డస్ట్ అలర్జీ ఉన్న వారు రాత్రిళ్లు బొప్పాయి తింటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.
సరిగా తోలు తీయని బొప్పాయి పండులో లాటెక్స్ ఉంటుంది. దాని కారణంగా గర్భిణీ స్త్రీలక
ు సమస్యలు వస్తాయి. గర్భిణులు బొప్పాయి పండు తినకపోవటం మంచిది.
Related Web Stories
చలికాలంలో కాళ్ల పగుళ్లు.. ఈ టిప్స్ పాటించండి..
భారతీయులకు బెల్లం ఒక ప్రత్యేకమైనది అది ఏ కాలంలో ఎక్కువ తినాలి
నెల రోజుల పాటు గుడ్డు తిన్నారంటే జరిగేదిదే..
షుగర్ పేషెంట్స్కి గుడ్ న్యూస్.. పైసా ఖర్చు లేని సింపుల్ చిట్కా