పండ్లు తినేటప్పుడు ఈ నియమాలు పాటిస్తున్నారా..

పెరుగు, చీజ్ వంటి పాల ఉత్పత్తులతో పండ్లను కలిపి తీసుకోకూడదు

పండ్లలో ఉండే సహజ చక్కెరలను, ఫైబర్‌లను  సమర్థవంతంగా జీర్ణం చేసేందుకు విడి విడిగా తీసుకోవడం మంచిది

పండ్లు భోజనం చేసిన వెంటనే తీసుకోవడం వల్ల జీర్ణక్రియ ఆలస్యం అవుతుంది

పోషకాల శోషణ పెంచడానికి, పండ్లను భోజనానికి ముందు చిరుతిండిగా తినడం మంచిది

సాయంత్రం ఆలస్యంగా పండ్లు తినడం వల్ల నిద్రకు భంగం కలుగుతుంది

శరీరం, జీవక్రియ చురుకుగా ఉన్నప్పుడు పండ్లను తీసుకోవడం మంచిది

పండ్లను జ్యూస్ రూపంలో తీసుకోవడం వల్ల అందులోని ఫైబర్‌ని కోల్పోతాయి