కర్బూజ పండు తిన్న తర్వాత  వీటిని తినకండి..

కర్బూజ ఒక రుచికరమైన పండు. దీంట్లో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి.

 దీంట్లో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది, కాబట్టి ఇది శరీరాన్ని చల్లబరుస్తుంది. 

అయితే, కర్బూజ పండు తిన్న తర్వాత పొరపాటున కూడా వీటిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.

పొరపాటున కూడా కర్బూజ పండు తిన్న తర్వాత పెరుగు తినకండి. దీనివల్ల అజీర్ణ సమస్య మొదలవుతుంది.

కర్బూజ పండు తిన్న వెంటనే కూల్ డ్రింక్ లేదా సోడా డ్రింక్ తాగకూడదు.

ఈ పండు తిన్న వెంటనే కారంగా, ఘాటుగా, ఉప్పగా లేదా వేయించిన ఆహారాన్ని తినకూడదు. ఎందుకంటే జీర్ణక్రియ దెబ్బతింటుంది. 

కర్బూజ పండు తినే ముందు లేదా తర్వాత పొరపాటున కూడా మద్యం తాగకూడదు. ఇలా చేయడం వల్ల ఎసిడిటీ జీర్ణ సమస్యలు వస్తాయి.