మధ్యాహ్నం చాలా మది  నిద్ర పోతుంటారు.

మరీ ముఖ్యంగా లంచ్ చేసిన తర్వాత చాలా నిద్ర వస్తుంటుంది.

మధ్యాహ్నం నిద్ర తీయడం ఆరోగ్యానికి చాలా  మంచిది అంటుంటారు ఆరోగ్య నిపుణులు .

ఎక్కువసేపు నిద్రపోవడం మానుకోవాలి.

కొందరు రాత్రి సమయంలో సరిగా నిద్రపోకపోవడం వలన  మధ్యాహ్నం గంటలు గంటలు నిద్ర పోతారు.

కానీ దీని వలన అనేక అనారోగ్య సమస్యలు దరి చేరే అవకాశం ఉన్నదంట.

మధ్యాహ్నం తిన్న తర్వాత ఎక్కువ సేపు నిద్ర పోవడం వలన  బద్దకం, చిరాకు, అలసట వంటి సమస్యలు తలెత్తుతాయంట.

ప్రతి రోజూ మధ్యాహ్నం కునుకు సమయంలో 30 నిమిషాల కంటే ఎక్కువ సేపు నిద్రపోవడం వలన ఆరోగ్యం దెబ్బతింటుందంట.

అధిక రక్తపోటు, డయాబెటిస్, గుండె సమస్యలు వంటి అనేక వ్యాధుల బారిన పడే అవకాశం ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.