కొన్ని ఆహార పదార్థాలను తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.. 

రోజూ ఉదయం ఖాళీ కడుపుతో గ్లాసు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. 

గుమ్మడికాయ గింజల్లో మెగ్నీషియం, పొటాషియం తదితర పోషకాలు బీపీని కంట్రోల్ చేస్తాయి.

మందార టీని తాగడం వల్ల కూడా రక్తపోటును నియంత్రించవచ్చు.

పొటాషియం అధికంగా ఉండే అరటిపండ్లు, కివీఫ్రూట్, పుచ్చకాయలు, నారింజ తదితర పండ్లను తీసుకోవాలి.

ఆకుకూరలు, టమోటాలు, పప్పుధాన్యాలు, సాల్మన్, ట్యూనా వంటి చేపలు కూడా బాగా పని చేస్తాయి. 

ఈ ఆహారంతో పాటూ ఉప్పును మితంగా తీసుకోవడం, వ్యాయామం తదితర పనులు చేయడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది.

ఈ విషయాలన్నీ కేవలం అవగాహన కోసం మాత్రమే. ఎలాంటి సమస్య వచ్చినా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.