రక్తపోటుకి అరటి పండు ఓ దివ్యౌషధం తెలుసా..

అధిక రక్తపోటున్న వాళ్లు రోజుకొక అరటిపండు తినాలంటున్నారు వైద్యులు

అరటిపండులో దాదాపు 400 నుంచి 450 మిల్లీగ్రాముల పొటాషియం ఉంటుంది

పొటాషియం శరీరంలోని సోడియం దుష్ప్రభావాలను కుంటు పరుస్తుంది

సోడియం శరీరంలో నీటి నిల్వను పెంచి రక్తపు పరిమాణం పెరిగి, రక్తపోటు పెరుగుతుంది

అదనపు సోడియంను మూత్రం ద్వారా బయటకు పంపించడంలో పొటాషియం సహాయపడుతుంది

అల్పాహారానికీ, మధ్యాహ్న భోజనానికీ మధ్య ఒక అరటిపండు తినడం అలవాటు చేసుకోవాలి

పండుతో పాటు గ్లాసుడు నీళ్లు, గుప్పెడు నట్స్‌ కూడా తీసుకోవడం ఆరోగ్యకరం